మోసపూరిత హామీలతో 30 లక్షల మంది నిరుద్యోగులను కాంగ్రెస్ దగా చేసిందని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధిరాణి రుద్రమ దేవి అన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల కోసం గత వారం రోజులుగా జేఏసీ నాయకుడు మోతీలాల్ నాయక్ నిరాహార దీక్షను కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలను తీయాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.