మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల సమయంలో తనపై నమోదైన కేసుల్లో విచారణ అధికారులను మార్చాలని ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను విచారించేందుకు కోర్టు అంగీకరించింది. ఎన్నికల సందర్భంగా జరిగిన అల్లర్లలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలపైనే కేసులు నమోదు చేశారని పిటిషన్లో పిన్నెల్లి పేర్కొన్నారు.