పవన్ కళ్యాణ్‌తో పూర్ణా పిక్చర్స్ ఎండీ భేటీ

59చూసినవారు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షుడు, పూర్ణా పిక్చర్స్ ఎండీ గ్రంధి విశ్వనాథ్ భేటీ అయ్యారు. పూర్ణా పిక్చర్స్ శత వసంతం సందర్భంగా పవన్ కళ్యాణ్‌కు కానుక అందించారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఓటీటీతో పాటు సినిమా టికెట్ ధరల విషయంలోనూ ఇబ్బందులు ఉన్నాయని విశ్వనాథ్ పవన్ కళ్యాణ్‌కు తెలిపారు. సినిమా టికెట్ ధరల విషయంలో ఫ్లెక్సిబుల్ విధానం తీసుకురావాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్