ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామ సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయ నీటి గుండానికి వరద నీరు పోటెత్తింది. గత రెండు రోజులుగా గిద్దలూరు నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ఆలయ గుండానికి వరదనీరు భారీగా వచ్చి చేరుతుంది. దీంతో ఆలయ నీటి గుండంలో భక్తులు స్నానమాచరించేందుకు అధికారులు అనుమతి ఇవ్వటం లేదని శనివారం వెల్లడించారు.