దొంగకే షాక్ ఇచ్చిన ఆలయ నిర్వహకులు

71చూసినవారు
కొమరోలులోని నల్లగుంట్ల సాయిబాబా ఆలయ నిర్వహకులు దొంగకే షాకించారు. కొద్దిరోజులుగా ఆలయంలో దొంగలు చోరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని గుర్తించిన ఆలయ కమిటీ సభ్యులు సి. సి కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆలయంలో విలువైన వస్తువులు హుండీలో నగదు లేకుండా జాగ్రత్త పడ్డారు. గురువారం అర్ధరాత్రి సమయంలో ఆలయంలోకి ప్రవేశించిన దొంగ హుండీలో రూ. 30 మాత్రమే ఉండడంతో కంగుతిన్నాడు. శుక్రవారం కమిటీ సభ్యులు చోరీ విషయాన్ని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్