సచివాలయాలలో రికార్డులు సక్రమంగా నిర్వహించాలి: మంత్రి

80చూసినవారు
గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది రికార్డులు సక్రమంగా నిర్వహించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. శనివారం టంగుటూరు మండలం వల్లూరు గ్రామ సచివాలయంలో మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించారు.సచివాలయానికి సేవల నిమిత్తం ప్రతిరోజు ఎంతమంది వస్తున్నారు, వారికి అందిస్తున్న సేవల వివరాలు సిబ్బందిని అడిగి మంత్రి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్