
అద్దంకి: 50శాతం రాయితీపై అధికలోడు క్రమబద్ధీకరణకు అవకాశం
గృహ వివియోగానికి సంబంధించి అధిక లోడును 50 శాతం రాయితీతో క్రమబద్ధీకరించుకునేందుకు ఏపీ ఈఆర్సీ అవకాశం కల్పించదని ఈఈ మస్తాన్ రావు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఒక కిలోవాట్ కు రూ.2350 చెల్లించాల్సి ఉండగా 50 శాతం రాయితీతో రూ.1250 చెల్లిస్తే సరిపోతుందన్నారు. 5కిలో వాట్లలోపు అయితే స్థానిక విద్యుత్ కార్యాలయంలోని కౌంటర్ లో అంతకు మించితే మీసేవా కేంద్రాలలో చెల్లించాలన్నారు. ఈ అవకాశం జూన్ 30వ తేదీ వరకు ఉంటుందన్నారు.