రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలు
కొరిసపాడు మండలం బొడ్డువానిపాలెం గ్రామం వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాదు నుండి మద్దిపాడు మండలం దొడ్డవరం గ్రామానికి చెందిన బ్రహ్మయ్య కుటుంబం ఓటు వేయడానికి కారులో స్వగ్రామం వస్తుండగా బొడ్డువానిపాలెం దగ్గరకు వచ్చేసరికి కారు మినీ వ్యాను రెండు ఢీకొన్నాయి. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు ఉన్నారు. అయితే వారిలో జ్యోతి అనే మహిళకు స్వల్ప గాయాలు అయ్యాయి.