బాపట్ల డీఎస్పీగా జి. రామాంజనేయులు శనివారం పదవీబాధ్యతలు చేపట్టారు. సాధారణ బదిలీల్లో భాగంగా బాపట్ల డీఎస్పీగా వచ్చారు. ముందుగా కార్యాలయ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొత్త డీఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని, అసాంఘిక శక్తులను ఉక్కుపాదంతో అణిచేస్తానని, ప్రజలు కూడా పోలీసు శాఖకు సహకారం అందించాలని ఆయన కోరారు. ఆయన పరిధిలో పర్చూరు కూడా ఉంది.