చీరాల అసెంబ్లీ టికెట్ ను ప్రధాన పార్టీలు స్థానిక బీసీలకే ఇవ్వాలంటూ నియోజకవర్గంలో సాగుతున్న సభలు, సమావేశాలలో వైసీపీ నేతలు చురుకుగా పాల్గొనడం చర్చనీయాంశమైంది. చీరాల వైసిపి టిక్కెట్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన కరణం వెంకటేష్ కు ఖరారు అయ్యాక ఈ ఉద్యమ ఉధృతి పెరగడం విశేషం.సోమవారం రాత్రి జరిగిన సభలో పార్టీ జడ్పిటిసిలు ఆకురాతి పద్మిని,బండ్ల తిరుమలాదేవి, దేవాంగ కార్పొరేషన్ చైర్మెన్) బీరక సురేంద్ర పాల్గొన్నారు.