మల్లెలవాగులో మృతదేహం లభ్యం

55చూసినవారు
మల్లెలవాగులో మృతదేహం లభ్యం
దొనకొండ మండలంలోని గంగదేవిపల్లి సమీపంలో మల్లెలవాగులో పూర్తిగా కాలిపోయిన మృతదేహం బుధవారం గుర్తించారు. స్థానిక రైతులు ఈ విషయాన్ని వీఆర్వో శివకోటేశ్వరరావుకు తెలియజేయగా, ఆయన ఎస్సై విజయకుమార్‌కు ఫిర్యాదు చేశారు.పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పెట్రోల్ పోసి తగులబెట్టినట్లు అనుమానిస్తున్నారని తెలిపారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్