ప్రకాశం జిల్లా రాచర్లలో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో మంగళవారం కంభం మండలం బీసీ కాలనీకి చెందిన 15 కుటుంబాలు వైసీపీని వీడి టిడిపిలో చేరాయి. ఈ సందర్భంగా టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. టిడిపి విజయానికి కార్యకర్తలందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఎన్నికలలో విజయం సాధించేలా చూడాలని అన్నారు.