పగిలిన సాగర్ నీటి పైపు.. ఎగిసిపడుతున్న నీరు

55చూసినవారు
సాగర్ నుంచి పొదిలికి నీటిని సరఫరా చేసే నీటి పైపు పగిలిపోయిన సంఘటన శనివారం జరిగింది. మండలంలోని కుంచేపల్లి సమీపంలో సాగర్ నుంచి వచ్చే పైపులైను పగిలిపోయి పది అడుగుల మేర నీరు ఎగిసిపడుతుంది. దీంతో నీరంతా వృధా కావడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి పగిలిపోయిన పైపునకు మరమ్మతులు చేసి నీటి వృధా అరికట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్