చిక్కుడు పంటను ధ్వంసం చేసిన రైతులు

79చూసినవారు
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం బురుజుపల్లి గ్రామంలో గురువారం చిక్కుడు పంట వేసిన రైతులు వారి పంటను ధ్వంసం చేశారు. మూడు నెలలు సమయమైనా చిక్కుడు పంటకు పూతకాని కాయకాని కాయకపోవడంతో రైతులు పంటను ధ్వంసం చేసినట్లు తెలిపారు. ప్రైవేటు వ్యక్తుల వద్ద నుంచి కేజీ విత్తనాలు 700 రూపాయల వరకు పెట్టి కొనుగోలు చేశామని రైతులు తెలిపారు. రైతులను మోసగించిన వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్