రేకుల షెడ్డు ను కూల్చేందుకు ప్రయత్నించిన మహిళలు

73చూసినవారు
ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని భాగ్యనగర్ వై జంక్షన్ వద్ద అక్రమంగా నిర్మించిన రేకుల షెడ్డు ను మహిళలు గడ్డపారలతో కూల్చేందుకు మంగళవారం ప్రయత్నించారు. రంగ ప్రవేశం చేసిన పోలీసులు రేకుల షెడ్డును కూల్చకుండా అడ్డుకున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తే అక్రమ కట్టడాలను అధికారులే తొలగిస్తారని మహిళలకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు.

సంబంధిత పోస్ట్