అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న మహిళపై దాడి

53చూసినవారు
అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న మహిళపై దాడి
ప్రకాశం జిల్లా, కొండేపి మండలం నెన్నూరుపాడులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న మహిళపై ఐదుగురు కలిసి దాడికి పాల్పడ్డారు. ఆదివారం బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్సై కృష్ణ బాబు తెలిపారు. ఫిర్యాదురాలి పొలం సమీపంలోనే మూసి ఏరు ఉండటంతో నిందితులు అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లుగా గుర్తించామని ఎస్సై చెప్పారు. జరిగిన సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్