కొండేపిలో అత్యధిక ధర కేజీ రూ. 360

62చూసినవారు
కొండేపిలో అత్యధిక ధర కేజీ రూ. 360
కొండేపి పొగాకు వేలం కేంద్రంలో బుధవారం అత్యధిక ధర కేజీ రూ. 360 పలికిందని, ఈ బోర్డు చరిత్రలోనే ఇది రికార్డు ధర అని వేలం నిర్వహణాధికారి జి సునీల్ కుమార్ తెలిపారు. నేతివారిపాలెం, రామచంద్రపురం గ్రామాలకు చెందిన రైతులు 921 బేళ్లు వేలానికి తీసుకురాగా 884 కొనుగోలయ్యాయి. వ్యాపారులు వివిధ కారణాలతో 37 బేళ్లను తిరస్కరించారు. కనిష్ట ధర రూ. 204. సరాసరి ధర రూ. 301. 87 పలికింది. వేలంలో 25 మంది వ్యాపారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్