ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి: ఎస్పీ

58చూసినవారు
ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి: ఎస్పీ
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి, మీడియా మిత్రులకు ఎస్పీ ఏఆర్ దామోదర్ శుక్రవారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వినాయక చవితి మండపాల ఏర్పాట్లలో ఉత్సవ కమిటీ వారు, పోలీసు వారి సూచనలు పాటించి, ప్రశాంతమైన వాతావరణంలో గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలన్నారు. సంఘటనలు తలెత్తితే వెంటనే స్థానిక పోలీసు లేదా డయల్ 100 కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్