ఒంగోలులో ప్రజలను ఆకట్టుకుంటున్న సైకత శిల్పం

6118చూసినవారు
ఓటు హక్కు వినియోగం పై ప్రజలను చైతన్యం చేస్తూ అధికారులు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఒంగోలు నగరంలోని చర్చి సెంటర్ లో ఓటు వినియోగం పై అవగాహన కల్పించే దిశగా సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు. తీరప్రాంతాల్లో చూసే సైకత శిల్పాన్ని ఒంగోలు పట్టణ నడిబొడ్డున ఏర్పాటు చేయటంతో ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సైకత శిల్పాన్ని పరిశీలించి శిల్పి బాలాజీని అభినందించారు.

సంబంధిత పోస్ట్