వైసీపీలో చేరిన టిడిపికి చెందిన 15 కుటుంబాలు
ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని గొల్లపల్లి గ్రామంలో టిడిపి పార్టీకి చెందిన ఐదవ వార్డు నెంబర్ కాకర్ల దేవదానం వారితో పాటు 15 కుటుంబాలు శనివారం టిడిపిని వీడి వైసీపీలోకి రావడం జరిగింది. ఈ సందర్బంగా మార్కాపురం వైఎస్ఆర్సిపి అభ్యర్థి అన్న వెంకట రాంబాబు పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.