కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఏప్రిల్ 19 నుంచి అగ్రరాజ్యం అమెరికాలో పర్యటించనున్నారు. అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీని ఆయన సందర్శించనున్నారు. బోస్టన్లో ప్రవాస భారతీయులతో భేటీ అవుతారని సమాచారం. అయితే రాహుల్ గాంధీ పర్యటనపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.