క్వాటర్ మందు కోసం హత్య - సిఐ
ఎర్రగొండపాలెంలోని రవీంద్ర వైద్యశాల సమీపంలో 26వ తేదీన జరిగిన హత్య కేసును పోలీసులు చేదించి ముద్దాయిని అరెస్ట్ చేశారు. శనివారం సి. ఐ రాములు నాయక్, ఎస్. ఐ సుదర్శనలు వివరాలను వెల్లడించారు. మృతుడు శ్రీనివాసులు, ముద్దాయి రాజేష్ లు మద్యానికి బానిసయ్యారు. క్వాటర్ మందు కోసం ఇద్దరు గోడవపడ్డారు. ఇనుప రాడ్డుతో శ్రీనివాసులను కొట్టి చంపినట్లు వారు తెలిపారు. ముద్దాయిని కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు.