
పుల్లలచెరువు: ఎస్సీలు ఆర్ధికంగా అభివృద్ధి చెందాలి
పుల్లలచెరువు గ్రామంలోని ఉమ్మడివరం ఎస్సీ కాలనీలో బుధవారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మండల టీడీపీ ఉపాధ్యక్షులు మునగాల రామిరెడ్డిని వారు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా రామిరెడ్డి మాట్లాడుతూ ఎస్సీలు ప్రభుత్వం అందించే సంక్షేమ పధకాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.