AP: వైసీపీ హయాంలో గుడ్ల కాంట్రాక్టర్లకు ₹112.5 కోట్లు, చిక్కీల కాంట్రాక్టర్లకు ₹66 కోట్ల బకాయిలు పెట్టడం వల్లే కొన్ని స్కూళ్లకు వీటి సరఫరా నిలిచిపోయిందని మంత్రి లోకేశ్ తెలిపారు. కూటమి సర్కార్ వచ్చాకే వీటి పంపిణీ ఆగిపోయిందని తప్పుడు ప్రచారం చేయడం బాధాకరమన్నారు. బకాయిలను అతి త్వరలో చెల్లిస్తామని కాంట్రాక్టర్లకు భరోసా ఇచ్చారు. విద్యార్థులకు గుడ్లు అందేలా చూడాలని ఆదేశించారు.