రాజ్యసభ సభ్యత్వానికి కాంగ్రెస్ సీనియర్ నేత కె.కేశవరావు రాజీనామా చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కేకే సేవలను పార్టీ వినియోగించుకుంటుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఏది మంచిదో అదే నిర్ణయం కేకే తీసుకున్నారన్నారు. కాగా, తాను కాంగ్రెస్ మనిషినని, కాంగ్రెస్ తన సొంత ఇల్లు అని ఈ సందర్భంగా కేకే వ్యాఖ్యానించారు. ఆ పార్టీ ఎంపీలతోనే తెలంగాణ వచ్చిందన్నారు.