విజయవాడ ఎంపీ పదవికి, టీడీపీకి రాజీనామా చేస్తానని కేశినేని నాని ప్రకటించడంతో ఆయనపై
వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) విమర్శలు గుప్పించారు. కేశినేని నాని బెజవాడకే గుదిబండలా తయారయ్యారంటూ మండిపడ్డారు.
టీడీపీ వల్లే నాని పదేళ్లు బండిని లాక్కొచ్చారని బ్యాంకులను బాది,ప్రజలను, ఉద్యోగులను పీల్చి పిప్పి చేశారని అన్నారు. గత ఎన్నికల్లో కేశినేనిపై
వైసీపీ నుంచి పీవీపీ పోటీ చేసి ఓడిపోయారు.