తెలంగాణలోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పాత బెల్లంపల్లి గ్రామానికి చెందిన రాజు, లండన్కు చెందిన డయానా వివాహ బంధంతో ఒక్కటయ
్యారు. బెల్లంపల్లి పట్టణంలో హిందూ సంప్రదాయం ప్రకారం ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. రాజు గత మూడేళ్లుగా లండన్లో వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలో డయానాతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. భారత్లోనే పెళ్లి చేసుకోవాలన్న ఆమె కోరిక మేరకు.. స్థానిక ఆచారం ప్రకారం పెద్దలు వివాహం జరిపించారు.