AP: వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో చేసిన కృషి వల్లే విశాఖపట్నంలో రీజినల్ ఆఫీస్ తెరచేందుకు RBI నిర్ణయించిందని వైసీపీ తెలిపింది. జగన్ హయాంలోనే బిల్డింగ్ పనులు సగం పూర్తయ్యాయని పేర్కొంది. కానీ ఇప్పుడు సిగ్గు లేకుండా దాని క్రెడిట్ కూడా తమ నాయకుడి ఖాతాలో వేసేందుకు ఎల్లో మీడియా ప్రయత్నిస్తోందని మండిపడింది.