AP: శ్రీకాకుళం(D) గార్ల
(M) కె.మత్స్యలేశంకు చెందిన గ్రామ సచివాలయ ఉద్యోగి సుశీల తాను చనిపోతూ మరి కొందరి జీవితాల్లో వెలుగులు నింపారు. ఈ నెల 16న జరిగిన రోడ్డు ప్రమాదంలో సుశీల
తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను ఆస్పత్రిలో చేర్పించగా.. బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో పుట్టెడు దు:ఖంలోనూ సుశీల తల్లిదండ్రులు గోవిందరావు, జ్యోతి ఆమె అవయవాలు దానం చేసేందుకు ముందుకొచ్చి.. మరికొందరికి కొత్త జీవితం ఇచ్చారు.