ఏపీ సీఎం చంద్రబాబుకు ఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల లేఖ రాశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. జగన్ ప్రభుత్వంలోని అవినీతి వ్యవహారాలు.. చేపట్టాల్సిన చర్యలపై సంచలన సూచనలు చేసిన యనమల అవినీతిపరుల దిగమింగిన సోమ్మను తిరిగి రాబట్టేలా ప్రత్యేక చట్టం చేయాలని లేఖలో ప్రస్తావించారు. వైసీపీ నేతలు మింగేసిన డబ్బును రెవెన్యూ రికవరీ చట్టo అమలు, లేదా ఏదైనా ఇతర ప్రత్యేక చట్టం ద్వారా తిరిగి రాబట్టాలని లేఖలో పేర్కొన్నారు.