సీఎం జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘జగన్ కేసుల ఛార్జ్షీట్లో వైఎస్సార్ పేరును చేర్చింది సీబీఐ.. కాంగ్రెస్ కాదు. వైఎస్సార్ పేరు లేకుంటే ఆ కేసుల్లో నుంచి జగన్ బయట పడరని రాజశేఖర్ రెడ్డి పేరును జగన్ లాయర్ సుధాకర్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేసి చేర్పించారు. అందుకు ప్రతిఫలంగా జగన్ ప్రభుత్వంలో సుధాకర్ రెడ్డికి అదనపు అడ్వొకేట్ జనరల్ పదవి ఇచ్చారు. ఇది వాస్తవం కాదా?.’ అని షర్మిల ప్రశ్నించారు.