గీతాంజలి మృతిపై ప్రత్యేక దర్యాప్తు

6916చూసినవారు
గీతాంజలి మృతిపై ప్రత్యేక దర్యాప్తు
తెనాలికి చెందిన గీతాంజలి మృతిపై ప్రత్యేక దర్యాప్తు చేస్తున్నామని గుంటూరు ఎస్పీ తుషార్ దూడి అన్నారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ వల్ల మనస్థాపానికి గురై గీతాంజలి ఈ నెల 7న తెనాలిలో ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె కుటుంబ సభ్యులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. ఆమె పట్ల సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులు, వాటిని ఎవరు పెట్టారు, ఏ ఐడీ నుంచి పెట్టారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. త్వరలో నిందితులను అరెస్ట్ చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్