ఎలాన్ మస్క్ నేతృత్వంలోని సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్ ‘X’ భారీగా భారతీయుల ఖాతాలపై నిషేధం విధించింది. ఐటీ నియమాలు 2021 ఉల్లంఘన కారణంగా ఫిబ్రవరి 26 నుంచి మార్చి 25 మధ్య మొత్తం 2,12,627 ఖాతాలను తొలగించినట్లు పేర్కొంది. వీటిలో చిన్నారులపై లైంగిక వేధింపులను, నగ్న దృశ్యాలు ప్రోత్సహించే ఖాతాలు ఉన్నాయని తెలిపింది. అలాగే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే అంశాలకు సంబంధించినవి ఉన్నాయని పేర్కొంది.