మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్లోని అసిర్గఢ్ కోట వద్ద శనివారం షాకింగ్ ఘటన జరిగింది. ఈ చారిత్రాత్మక కోట వద్దకు పిక్నిక్ కోసం కొందరు వచ్చారు. అయితే అకస్మాత్తుగా వారిపై తేనెటీగలు దాడి చేశాయి. దీంతో తొక్కిసలాట జరిగింది. పిక్నిక్కు వచ్చిన వారంతా భయంతో పరుగులు పెట్టారు. ఈ ఘటనలో 30 మందికి పైగా గాయపడ్డారు. వారిలో 15 మంది స్థానిక ఆసుపత్రిలో చేరారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.