వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్న ఎమ్మెల్యే ఇంటూరి

83చూసినవారు
వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్న ఎమ్మెల్యే ఇంటూరి
విజయవాడ రూరల్ మండలం జక్కంపూడి కాలనీలో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వర రావు గురువారం సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కాలనీలో వరదనీరు పూర్తిగా తగ్గిపోవడంతో, ప్రస్తుతం జరుగుతున్న బురద, డ్రైనేజీ కాలువల క్లీనింగ్ పనులను దగ్గరుండి పరిశీలించారు. ప్రభుత్వం అందజేస్తున్న ఆహారాన్ని స్వయంగా పరిశీలించి, నాణ్యత తగ్గకుండా చూడాలని అధికారులకు ఎమ్మెల్యే నాగేశ్వరరావు సూచించారు.

సంబంధిత పోస్ట్