వారికి ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్

72చూసినవారు
ఉలవపాడులోని ప్రభుత్వ ఎస్సీ బాలుర హాస్టల్ ని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వర రావు మంగళవారం తనిఖీ చేశారు. హాస్టల్ తమకు తిండి సరిగా పెట్టడం లేదని, ఉడికి ఉడకని అన్నం, నీళ్లచారు, పచ్చడితో సరిపెడుతున్నారని విద్యార్థులు ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎమ్మెల్యే.. ఇంకోసారి పిల్లలను ఇబ్బంది పెట్టినట్లు తెలిస్తే ఊరుకునేది లేన్నారు. చర్యలు తీవ్రంగా ఉంటాయి అంటూ ఎమ్మెల్యే హాస్టల్ సిబ్బందిని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్