కందుకూరు నియోజకవర్గంలోని ఉలవపాడు మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ 15వ వర్ధంతిని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ రావు హాజరై వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించి, ప్రజలకు బిర్యానీ వడ్డించారు. పేద ప్రజల ఆకలి తీర్చడం వైఎస్ఆర్ తోనే ప్రారంభమైందని ఆయన అన్నారు. ప్రజలందరికీ ఉచితంగా వైద్యం, చదువు అందాలన్నదే ఆయన కోరికన్నారు.