కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కోడలు మహిమా రెడ్డి మామకు మద్దతుగా శుక్రవారం కావలి పట్టణంలోని పలు వార్డుల్లో ఆమె వైసీపీ నాయకులతో కలిసి పర్యటించారు. రాబోయే ఎన్నికల్లో తన మామకు ఓటు వేసి మూడవసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. సొంత కుటుంబం కంటే కావలి ప్రజలంటేనే ఆయనకు ఎక్కువ ఇష్టమని ఆమె అన్నారు. ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ పైనే ఉంది అన్నారు.