టీ20 ప్రపంచకప్లో అంపైర్లుగా వ్యవహరించనున్న వారి పేర్లను ఐసీసీ ప్రకటించింది. ఈ జాబితాలో టీమిండియాకు విలన్ లా దాపరిస్తోన్న రిచర్డ్ కెటిల్బరో కూడా ఉన్నారు. గత 9 ఏళ్లుగా ఐసీసీ ఈవెంట్లలో టీమిండియా ఆడిన అన్ని నాకౌట్ మ్యాచుల్లో రిచర్డ్ అంపైర్గా ఉన్నారు. దురదృష్టవశాత్తూ ఆ మ్యాచులన్నింటిలో భారత జట్టు ఓటమి చవి చూసింది. ఇప్పుడు అతను మళ్లీ టీ20 వరల్డ్ కప్లోనూ అంపైర్గా వ్యవహరించనుండటం అభిమానుల్ని కలవరపెడుతోంది.