చేనేత కార్మికులతో మాట్లాడిన కాకర్ల సురేఖ

78చూసినవారు
నెల్లూరు జిల్లా ఉదయగిరి అసెంబ్లీ ఎన్డీఏ అభ్యర్థి కాకర్ల సురేష్ తమ్ముడు కాకర్ల సునీల్ సతీమణి కాకర్ల సురేఖ వింజమూరు మండల కేంద్రంలోని బీసీ కాలనీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న చేనేత కార్మికులను ఆమె కలిశారు. మగ్గం నేసి చేనేత కార్మికుల్లో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం వారిని సన్మానించి రాబోయే ఎన్నికల్లో కాకర్ల సురేష్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్