శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం బిజెపి కార్యాలయంలో సోమవారం ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన ముదిగుబ్బ మండలంలోని పోడ్రాళ్లపల్లి నుంచి 40 కుటుంబాలు, పూజారి తండా నుండి 50 కుటుంబాలు, RS తండా నుంచి 40 కుటుంబాలు, గారుగుతాండ నుండి 20 కుటుంబాలు బిజెపి పార్టీలోకి చేరాయి. ఎన్డీఏ కూటమి అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ కండువాలు వేసి భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించారు.