ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పరామర్శించారు. సోమవారం ధర్మవరంలోని సబ్ జైలులో వైసీపీ కార్యకర్తలను పరామర్శించడానికి కేతిరెడ్డి వెళ్లగా కూటమి నేతలు కేతిరెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డువచ్చిన వైసీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో ధర్మవరంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కేతిరెడ్డిపై దాడికి యత్నించిన విషయం తెలియగానే అనంత వెంకటరామిరెడ్డి ధర్మవరం వెళ్లారు. కేతిరెడ్డిని ఆయన స్వగృహంలో కలిసి ఘటనపై ఆరా తీశారు.