విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

76చూసినవారు
విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
ధర్మవరం రూరల్ మండలంలోని మల్కాపురం ప్రాథమిక పాఠశాలలో బుధవారం విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ చేసినట్లు టీఎన్ఎస్ఎఫ్ మండల అధ్యక్షులు చిట్రా అశోక్ పేర్కొన్నారు. గ్రామానికి చెందిన బాలకొండ శంకర్, పావని సహకారంతో విద్యార్థులకు పలకలు, పుస్తకాలు, పెన్నులు, తదితర విద్యా సామగ్రి పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు బీ. రాము, ఏం. శ్రీకాంత్, ఏ. వంశీ, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్