శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం పట్టణంలోని బాలాజీ మనోహర్ కార్యాలయంలో వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కష్ట కాలాల్లోనూ పార్టీని వీడకుండా పార్టీకి వెన్ను దండగా ఉన్న పార్టీ అధిష్టానం తమను పట్టించుకోవడంలేదని, దీంతో కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు తెలిపారు.