దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని అదనపు జిల్లా జడ్జి కంపల్లె శైలజ పేర్కొన్నారు. బుధవారం హిందూపురం పట్టణంలోని సప్తగిరి కళాశాలలో మత్తు పదార్థాల నిషేధం పై న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడారు. యువత అనుకుంటే ఏదైనా సాధించవచ్చన్నారు. మత్తు పదార్థాలకు బానిసలు కావడం వల్ల అటు ఆరోగ్యంతో పాటు ఇటు ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడతారన్నారు. ముఖ్యంగా భారతదేశంలో ఉన్న యువ సంపద ప్రపంచంలోని ఏ దేశంలోనూ లేదన్నారు.