ఉచిత ఇసుక హామీని ప్రభుత్వం అమలు చేయాలి: సిపిఎం

51చూసినవారు
ఉచిత ఇసుక హామీని ప్రభుత్వం అమలు చేయాలి: సిపిఎం
కళ్యాణదుర్గం పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద ప్రభుత్వం ఉచిత ఇసుక హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం నాయకులు, కార్యకర్తలు శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు అచ్యుత్ ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి నాయకులు తాము అధికారంలోకి వస్తే ఉచిత ఇసుకను ఇస్తామన్నారు. ఇంతవరకు ఇవ్వలేదన్నారు. వినతి పత్రాన్ని డీటీకి అందజేశారు.

సంబంధిత పోస్ట్