మడకశిర మండలం చందకచర్ల గ్రామంలో శనివారం ఆంజనేయస్వామి దేవాలయం వద్ద మొదటగా స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వతంత్ర అభ్యర్థి ఆర్ జి పవిత్ర ఇంటింటికి వెళ్లి కరెంట్ స్తంభం గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించలని కోరారు. ఇప్పటికే నిరంతరం ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ప్రజా సేవలు చేశానన్నారు. తమకు ఓటు వేసి గెలిపిస్తే మరెన్నో సేవలు చేసి మడకశిర ని అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు.