ధర్మవరం పట్టణంలో అడవి పంది దాడి.. ముగ్గురికి గాయాలు

71చూసినవారు
ధర్మవరం పట్టణంలో అడవి పంది శుక్రవారం రాత్రి హల్చల్ చేసి ముగ్గురుని గాయపరిచింది. ధర్మవరం తేరు బజారులో శుక్రవారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఓ అడవి పంది చిన్నూరు పొలాల్లో నుండి పట్టణంలోకి ప్రవేశించి కనిపించిన ముగ్గురిని గాయపరిచింది. గాయపడిన వారు ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్నారు.

సంబంధిత పోస్ట్