ఇటీవల కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ గర్హీ తన X ఖాతాలో 46 సెకండ్ల పద్యం ఉన్న వీడియోను పోస్ట్ చేశారు. అయితే అది రెచ్చగొట్టేలా ఉందంటూ గుజరాత్ పోలీసులు కేసు నమోదు చేశారు. "ఏ ఖూన్ కే ప్యాసే బాత సునో..." అనే లిరిక్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ FIRని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. "ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్ర్యం ఒక భాగం. ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడటం న్యాయస్థానాల విధి" అని స్పష్టం చేసింది.