హిందూపురం పార్లమెంటుకు 40 మంది అభ్యర్థులు నామినేషన్లు వేసినట్టు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి అరుణ్ బాబు గురువారం పేర్కొన్నారు. ఈనెల 18 నుంచి25 వ తేదీ వరకు జరిగిన నామినేషన్లు ప్రక్రియలో భాగంగా వివిధ రాజకీయ పార్టీలు చెందిన వారితో పాటు స్వతంత్ర అభ్యర్థులు అందరూ కలిసి 40 నామినేషన్లు వేసినట్టు కలెక్టర్ పేర్కొన్నారు.