ప్రిన్సిపల్ సన్యాసమ్మ మృతిపట్ల పలువురు సంతాపం

576చూసినవారు
ప్రిన్సిపల్ సన్యాసమ్మ మృతిపట్ల పలువురు సంతాపం
లేపాక్షి ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపల్గా పని చేసిన సన్యాసమ్మ మృతిపట్ల గురువారం పలువురు సంతాపం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా రాపూరుకు చెందిన ఆమె ఆర్థిక శాస్త్రం అధ్యాపకురాలిగా 1989 నుంచి 2003 వరకు చిలమతూరు డీవీఆర్ కళాశాలలో పని చేశారు. అలాగే 2003లో ఆమడగూరు కళాశాలలో, 2005 నుంచి 2012వరకు లేపాక్షి ప్రభుత్వ కళాశాలలో పని చేసి పదవి విరమణ పొందారు.

సంబంధిత పోస్ట్